Posted on 2025-09-04 17:24:53
డైలీ భారత్, చంద్రంపేట: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు..
ప్రతి ఏటా సెప్టెంబర్ 5 న జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేసి సన్మానిస్తారు.. ఈ సంవత్సరము ప్రకటించినా ఉత్తమ ఉపాధ్యాయుల లిస్ట్ లో సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు గువలకొండ శ్రీనివాస్ భౌతికశాస్త విభాగంలో మరియు కైరి పద్మ ఇంగ్లీష్ విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారు.విద్యారంగ అభివృద్ధికి కృషి చేసి, బోధనలో ప్రతిభ కనబరిచి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులే ఈ అవార్డుకు ఎంపికయ్యారని. ఉపాధ్యాయ దినోత్సవం రోజున వీరి కృషికి గౌరవం లభించనుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరిరువు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ఎం శ్రీనివాస్,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ కంది సుజాత రెడ్డి, ఉపాధ్యాయ బృందం కొండి కొప్పుల రవి,ముంజ రమ, వోద్యారపు మధు సుధన్,వేముల అంజలి, లత,త్రివేణి మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >