డైలీ భారత్, ధర్మపురి: ఈనాటి రోజులలో ఇంతటి ధవుర్భాగ్య పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు చూడడటం జరుగుతుందో మరీ అని రైతు రాష్ట్ర నాయకులు వేముల విక్రమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం రోజున జగిత్యాల జిల్లా లోని ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వ్యవసాయ మండల అధికారి కార్యలయం మరియు డివిజన్ అధికారి కార్యాలయం కు వెళ్లే సందర్భంలో కలుగుతున్న మురుగునీటి మడుగు వలన కలుగుతున్న ఇక్కట్లను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అటూ అధికారులు సిబ్బంది రైతులు ఎన్నో ఏళ్లుగా తీవ్రాతి తీవ్ర ఇక్కట్లు పడుతున్న సమస్య పరిష్కరించే నాధుడే కారువయ్యాడు అని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి యుద్ద ప్రతిపాదికన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు లేని పక్షంలో తగిన కార్యాచరణ చేపడుతామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రీవినాయక రైతు మిత్ర సంఘము, కోసునూర్ పల్లె కార్యదర్శి బుక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.