| Daily భారత్
Logo




మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై సిద్దం చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-09-04 15:49:15

Share: Share


మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై సిద్దం చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అసంపూర్తి పనులు పూర్తి చేయాలి

డ్రైనేజ్, నీటి సమస్య పరిష్కరించాలి

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట:ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న తీరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.

మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ మీద తయారుచేయాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీ, నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్ల పరిశీలించారు. విద్యాలయానికి ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో నిత్యం అన్ని పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని, అభ్యాసన సామర్ధ్యాల ఆధారంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >
Image 1

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

Posted On 2026-05-04 18:00:43

Readmore >
Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >