Posted on 2025-09-04 14:03:45
వరద అనంతరం జరిగిన నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు. ఇటీవల జిల్లాలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను, పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11.30కు లింగంపేట మండలంలో దెబ్బతిన్న వంతెనను, బురిగిద్ద గ్రామంలో నీట మునిగిన పొలాలను సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధ్వంసమైన రహదారులను, జీఆర్ కాలనీని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వరద నష్టాలపై చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా..సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా మళ్లిస్తున్నట్లు పేర్కొంది. ప్రజలు, వాహనదారులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని పోలీస్ శాఖ కోరింది.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >