| Daily భారత్
Logo




రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కు నివాళులు

News

Posted on 2025-09-02 21:22:00

Share: Share


రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కు నివాళులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన నేత అని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల హృదయాలలో సజీవంగా ఉన్నాయని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ, బాసర ఐఐఐటి, సాగునీటి పథకాలు, గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 90 వేల ఎకరాలకు నీరు అందించడం వైఎస్సార్ కృషి ఫలితమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన నిలిచి, పంట రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ ధర్మగౌడ్, కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, యూత్ నాయకుడు ఉమ్మాజీ నరేష్, ఏఎంసీ డైరెక్టర్లు నరేందర్, రాజలింగం, గంగారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రన్న, వాసు బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >