Posted on 2025-08-15 11:41:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని ఎన్డీసీసీబీ బ్యాంకులో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం అందరం ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల వల్లే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుకుతున్నారని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్డీసీసీబీ బ్యాంక్ ద్వారా రుణాలను అందిస్తూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ ఏ రైటింగ్ లో తమ ప్రతిభను చాటిన విద్యార్థినిలకు బహుమతులు అందించారు. అదేవిధంగా ఎన్ డి సి సి బి, పి ఎ సి ఎస్ ఎస్ బ్యాంక్ ఇలా చైర్మన్లు డైరెక్టర్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పెంచడాన్ని తాము ఎంతగానో సంతోషిస్తున్నట్లు తమకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని బ్యాంకు లాభాన్ని మరింత రెట్టింపు స్థాయిలో పైకి తెస్తామని ఆయన అన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >