| Daily భారత్
Logo




సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

News

Posted on 2025-08-14 12:04:58

Share: Share


సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :  అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎం ఎల్ ఏ ధన్ పాల్ సూర్యనారాయణ  ప్రజలందరికీ ముఖ్య సూచనలు జారీ చేశారు. ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీటి నిల్వలు,మలిన వాతావరణం వంటి కారణాల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

పరిసర ప్రాంతాలలో నీటినిల్వ వ్యర్థలను తొలగించాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, మురుగునీటి కాలువలు, విద్యుత్ స్తంభాలు, తీగల వంటి ప్రదేశాలలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న పిల్లలు బయటికి వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు వారిని గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని  సూచించారు.

మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర ప్రదేశాలలో హెచ్చరికల బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని, వాటిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >