| Daily భారత్
Logo




పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

News

Posted on 2025-08-13 18:25:53

Share: Share


పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌  సన్‌ ప్రీత్‌ సింగ్‌

డైలీ భారత్, వరంగల్: పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్‌ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌  నల్లబెల్లి పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు స్టేషన్‌ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు.  అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు కిట్‌ ఆర్టికల్స్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్‌, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ, డీసీపీ చేతుల మీదుగా మొక్కలను ఈ తనిఖీల్లో ఈస్ట్ జోన్‌ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సిఐ సాయి రమణ, నల్లబెల్లి, ఖానాపూర్ ఎస్‌.ఐలు గోవర్ధన్,  రఘుపతి పాల్గోన్నారు.

Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >
Image 1

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

Posted On 2026-05-04 18:00:43

Readmore >
Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >
Image 1

దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి

Posted On 2026-05-04 15:32:36

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

Posted On 2026-05-04 15:31:43

Readmore >
Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >