| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో సోమవారం విజయ ఎంటర్ప్రైజెస్ కు చెందిన ప్రముఖ గోద్రెజ్ కంపెనీకి చెందిన హైటెక్నాలజీ లాకర్స్ షోరూమ్ ను అర్బన్ ఎమ్మెల్యే  సూర్యనారాయణ గుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గోద్రెజ్ కంపెనీ కి వివిధ వస్తు తయారీ లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఘనత గోద్రెజ్ కంపెనీకే దక్కుతుందన్నారు. అలాగే గోద్రెజ్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన గోద్రెజ్ లాకర్స్ హైటెక్నాలజీ నూతన హంగులతో నేటి తరానికి నచ్చే విధంగా తయారుచేసి లాకర్స్ లోనే మంచి పేరు సాధించిన ఘనత ఈ కంపెనీకి దక్కుతుందన్నారు. గోద్రెజ్ కు సంబంధించిన లాకర్స్ వివిధ వ్యాపార సంస్థలలో వినియోగించుకోవడంతోపాటు బ్యాంకులలో సైతం ఈ కంపెనీకి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. అనంతరం మారుతి నగర్ కృష్ణ మందిర్ ఎదురుగా హోమ్ ఇంటీరియల్ డెకరేటర్స్ కు చెందిన హోమ్ లాన్ షోరూమ్ ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిర్దితరంలో ప్రతి ఒక్కరూ ఇల్లు కడుతున్నారే తప్ప ఇంటీరియల్ డెకరేటర్ కు ఆసక్తి ప్రజలు వహిస్తున్నారని, ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని ఇంటీరియల్ డెకరేటర్ లో నిజామాబాద్ జిల్లాలోని ఈ సంస్థ మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు

Previous లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, డిచ్పల్లి ఏడవ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుల్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
Next అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే
ADVERTISEMENT