Posted on 2025-08-09 13:59:43
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీలో అర్జున ఛానల్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగ విద్యార్థులతో కలిసి చానల్ యాజమాన్యం మానసిక విద్యార్థిని విద్యార్థులకు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఇందులో చదువుతున్న దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు ఒకరినొకరు రాఖీ కట్టుకొని రాఖీ పండగ యొక్క విశిష్టతను తెలియపరిచారు. ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోని గొడవలకు పాల్పడుతూ ఆస్తి, ఇతరాత్రా సెటిల్మెంట్ విషయాల్లో తలదూచుకుంటూ ప్రశాంతంగా ఉండే సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్న అన్ని అవయవాలు ఉన్న వ్యక్తుల కంటే స్నేహ సొసైటీ లో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని కొనియాడారు. అదేవిధంగా వారికి సొంత తెలివితేటలు లేకపోయినా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య వారిలో ఉన్న తెలివితేటలు వెలికి తీసి ఇలా సమాజం ముందు ఉత్తమ బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >