Posted on 2025-08-08 16:54:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం రామవరంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ ఇంట శ్రావణమాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మహాలక్ష్మి అమ్మవారికి, తులసి మాతకు విశిష్ట పూజలు నిర్వహించారు.
విశిష్ట పూజల అనంతరం స్థానిక మహిళా ముత్తైదువులకు ఆకు,వక్క, పసుపు ,కుంకుమ, గాజులు పండ్లు పూలతో వాయనాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం పట్టణ మహిళలకు శ్రావణమాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలిపారు.
హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకున్నటువంటి, ముఖ్యంగా స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం వరలక్ష్మీ వ్రతమని,లక్ష్మీదేవిని నిష్టతో, భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >