Posted on 2025-08-08 16:33:29
ఘటనకు గలసమాచారం అందించేందుకు మీనమేషాలు లెక్కించిన ఫైర్ సేఫ్టీ అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని అయ్యప్ప దేవస్థానం కు వెళ్లే రోడ్డులో గల బివిఎం ఆర్కిటెక్కర్, ఇంటీరియర్ షాప్ లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే స్థానికులు దుకాణం లో నుండి పొగ అగ్ని వెలబడడంతో అగ్ని ప్రమాద నివారణ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద నివారణ వాహనం అధికారులు అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్ని ప్రమాద నివారణ అధికారి అనంతరావు తెలిపారు.
ఈ ప్రమాదంలో కంప్యూటర్, సిస్టం స్కానర్ ఫర్నిచర్ పూర్తిగా దహనం జరిగిందని అనంతరావు తెలిపారు
ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ తాను మధ్యాహ్నం ఇంటికి భోజనం కోసం వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇది ఇలా ఉండగా అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలపాలని మీడియా అగ్నిమాపక నివారణ అధికారులను ప్రశ్నిస్తే ఒకరిపై ఒకరు మీనమేషాలు లెక్కిస్తూ చివరకు సమాచారం అందించారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >