Posted on 2025-07-25 07:48:00
డైలీ భారత్, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్ట్ ఈ వారెంట్ జారీ చేసింది. అయితే హుజురాబాద్ ఎన్నికల ప్రచార ఉల్లంఘన కేసులో కోర్టు ముందు హాజరవమని ఎన్నిసార్లు నోటీసులు పంపినా బండి సంజయ్ హాజరు కాకపోవడంతో, కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి, మరింత సమయం కోరుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ తరపున న్యాయవాది రేపు కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చెయ్యనున్నారు. అలాగే ఈనెల ౩౦న కోర్టు ముందు హాజరయ్యేందుకు కూడా అనుమతి కోరనున్నారు
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >
చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Posted On 2026-07-23 08:08:04
Readmore >