Posted on 2025-07-23 06:55:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మంగళవారం రోజున సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆషాడమాస బోనాల సంబరాలను నిర్వహించుకున్నారు.
మనకు ఏ కష్టం వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా , ప్రకృతి వైపరీత్యాల వల్ల అనారోగ్యాలు సంభవించినా, రక్షించమని అమ్మవారికి బోనం రూపంలో భోజనం సమర్పిస్తు వేడుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ బోనాల పండుగ గురించి మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దని, ముందు తరాల వారికి వాటిని బహుమతిగా ఇవ్వాలని, మన సాంప్రదాయాలను నిలబెట్టుకోవాలని చెప్పారు. ఈ బోనాల సంబరాల వేడుకల్లో చిన్నారుల పోతరాజు వేషాలు,నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.. పాఠశాల నుండి ప్రారంభం అయిన బోనాలు గ్రామంలో డప్పు చప్పుళ్ళ మధ్య పోతరాజుల ఆటపాటలతో గ్రామ పురవీధులుగుండ తిరుగుతూ మళ్ళీ పాఠశాలకు చేరుకున్నారు..
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ కంది సుజాత రెడ్డి, గ్రామ పెద్దలు సూర దేవరాజు, పాతూరి రాజిరెడ్డి,పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పుర ప్రముకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >