Posted on 2025-07-22 12:55:46
ప్రజలందరూ సుఖశాంతులతో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని స్వామిని వేడుకున్న అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కలియుగ ప్రత్యక్ష దైవం అయినా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ద్వారం నుండి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కి ఘనస్వాగతం పలికిన వేద పండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుమల పుణ్య క్షేత్రం మరింత అభివృద్ధి సాధించనుందని అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసిన లేఖలకు ప్రత్యేక దర్శనం, వసతి గృహం కల్పిస్తున్న టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏడుకొండల వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రధాని మోదీకి మరింత మనోభాలన్నీ ప్రసాదించాలని, ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేల మంచి బుద్దిని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల జ్ఞానేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, కొంజేర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >