| Daily భారత్
Logo




తిరుమల శ్రీవారిని దర్శించుకున్న - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

News

Posted on 2025-07-22 09:25:46

Share: Share


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ప్రజలందరూ సుఖశాంతులతో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని స్వామిని వేడుకున్న అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కలియుగ ప్రత్యక్ష దైవం అయినా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ద్వారం నుండి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కి ఘనస్వాగతం పలికిన వేద పండితులు శాలువాతో సత్కరించి  ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుమల పుణ్య క్షేత్రం మరింత అభివృద్ధి సాధించనుందని అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసిన లేఖలకు ప్రత్యేక దర్శనం, వసతి గృహం కల్పిస్తున్న టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు  తెలిపారు.

ఏడుకొండల వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రధాని మోదీకి మరింత మనోభాలన్నీ ప్రసాదించాలని, ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేల మంచి బుద్దిని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల జ్ఞానేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, కొంజేర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Image 1

ఉక్రెయిన్ దాడిలో కేరళకు చెందిన భారత నావికుడు మృతి

Posted On 2026-07-21 19:01:13

Readmore >
Image 1

కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై పి.డి. చట్టం

Posted On 2026-07-21 17:10:38

Readmore >
Image 1

జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి

Posted On 2026-07-21 15:56:05

Readmore >
Image 1

సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

Posted On 2026-07-21 15:22:53

Readmore >
Image 1

తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

Posted On 2026-07-21 15:01:38

Readmore >
Image 1

సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా

Posted On 2026-07-21 14:56:26

Readmore >
Image 1

నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన

Posted On 2026-07-21 13:45:51

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ

Posted On 2026-07-21 12:52:04

Readmore >
Image 1

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు

Posted On 2026-07-21 07:46:47

Readmore >
Image 1

కూలుతున్న పైకప్పు.. వణుకుతున్న పసిప్రాణాలు!

Posted On 2026-07-21 07:12:29

Readmore >