Posted on 2025-07-16 18:33:25
250 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం.
అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు.
వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.
డైలీ భారత్, వేములవాడ: సుల్తానాబాద్ కి చెందిన వేముల శ్రీనివాస్,వేముల విజయ లక్ష్మీ అనే భార్యాభర్తలు మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి గంజాయి కొనుగోలు చేసి గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వాటితో జల్సాలు చేస్తుండేవారు.సిరిసిల్ల జిల్లాలో గ్రానైట్ కార్మికులకు ఎక్కువ రేటుకు గంజాయి అమ్ముయున్నారని అందులో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలం కోరేం గ్రామశివారుకి వస్తున్నారన్న సమాచారం మేరకు బోయినపల్లి ఎస్.ఐ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా అనుమానాస్పధముగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారివద్ద 250 గ్రాముల గంజాయి ,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి.తరలించడం జరిగిందిని వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్ తెలిపారు.
అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు.
గంజాయి నిందుతుల వివరాలు.
1.వేముల శ్రీనివాస్, r/o సుల్తానాబాద్.
2.,వేముల విజయ లక్ష్మీ r/o సుల్తానాబాద్.
యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు.జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >