Posted on 2025-07-12 17:12:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో దాదాపు తమ తాత ముత్తాతల తరం నుండి ఏళ్ల తరబడిగా ఊర పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని సర్వ సమాజ్ కమిటీ సభ్యుడు రవి తెలిపారు. పూర్వం గత్తర్ (ప్లేగు వ్యాధి) రావడంతో చాలామంది చనిపోయారని చెప్పారు. దీంతో అన్ని కులాల వారు కలిసి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను తయారు చేయించి నిష్ఠతో కొలవడంతో వ్యాధి అంతమైందన్నారు. వ్యాధి తగ్గడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్లో ఈ నెల 13న ఊర పండుగను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ పండుగకు ఐదు రోజుల పాటు నిష్టతో ఉండి 13 ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగి శ్రీనివాస్ తెలిపారు. దాదాపు 80 ఏళ్ల నుంచి మూడు తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఆయన చెప్పారు. మామిడి చెట్టు నుంచి తీసుకువచ్చిన కర్రతో మాత్రమే ప్రతిమలను తయారు చేస్తామని వారు వివరించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >