Posted on 2025-07-11 22:49:21
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.విపత్కర సమయాలలో ప్రజలకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.వరదల నేపథ్యంలో పోలీసు శాఖ తరఫున ఐదు డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎ.ఎస్.పి విక్రమ్ సింగ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏం శ్రీనివాస్, ఇ శ్రీనివాస్, సీఐ మడుపల్లి నాగరాజు, ఎస్సైలు గంజి స్వప్న, ట్రాఫిక్ ఎస్ఐ పండుగ తిరుపతి, అదనపు ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >