Posted on 2025-07-11 21:44:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ నెల 6న జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. ఆయన తన సమీప ప్రత్యర్థి మాజీ జిల్లా, నగర అధ్యక్షుడు అర్వపల్లి పురుషోత్తం గుప్త పై 888 ఓట్లతో గెలుపొందారు. ఈ నెల 6న జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలతో పాటు మాణిక్ భవన్ ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) పాలకమండలి, ఆర్య వైశ్య భవన్ కళ్యాణ మండపం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటిలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు పారదర్శకంగా జరుగలేదని గోడవలు జరిగాయి. ఎన్నికల అధికారులకు పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 7న జరగాల్సిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు... మాణిక్ భవన్ పాఠశాల కమిటీ చైర్మన్ గా ఇంగు శివప్రసాద్ 501 ఓట్ల మెజార్టీతో, ఆర్య వైశ్య భవన్ కు ఇల్లెందుల సుధాకర్ 664 ఓట్లు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా పాల్తీ రవి 1365 ఓట్లతో ప్రత్యర్థిపై గెలుపొంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు నియామక పత్రాలను అందజేశారు.ఈ నేపథ్యంలో సంబరాలు నిర్వహించారు.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >