Posted on 2025-07-10 21:11:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నెల నెల ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే వృద్ధాప్య పింఛన్ పింఛన్ డబ్బుల కోసం తల్లిని
దారుణంగా కొట్టి చంపాడు తనయుడు. ఈ దారుణ ఘటన నిజామాబాదు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం మధ్యాహ్నం వర్ని మండలం జాలాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కధనం ప్రకారం.. జలాల్ పూర్ గ్రామానికి చెందిన మక్కలపల్లి సాయవ్వ (57)కు భర్త చనిపోవడంతో వితంతు పింఛన్ వచ్చేది. సాయవ్వ కొడుకు గత కొన్ని రోజులుగా తనకు తాగుడుకు డబ్బులు లేవని పింఛన్ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తు గొడవ పడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం సాయవ్వతో సాయిలు గొడవ పడి కుర్చీతో తలపై బాదాడు. కిందపడిన సాయవ్వ తలపైన, చాతిపై రాయిని తీసుకుని చావబాదాడు. ఈ ఘటనలో సాయవ్వ తీవ్రంగా గాయపడటంతో సాయిలు వదిలి పారిపోగా, స్థానికులు ఆమెను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైధ్యులు సాయివ్వ చనిపోయిందని నిర్ధారించారు. ఈ మేరకు వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >