Posted on 2025-07-10 21:10:13
డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మంగళవారం మాదాపూర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కగా.. గురువారం పోలీస్ శాఖకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అక్కడ వారి కేసును విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తానని, ఎలాంటి కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తాను అడిగింది ఇవ్వాలంటూ బేరం కుదుర్చుకున్నాడు.
అందుకు అంగీకరించిన బాధితుడు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయమై ఏసీబీ అధికారుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. గురువారం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ కు చెందిన ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వేణుగోపాల్ ఈ మధ్యనే ప్రమోషన్ లో భాగంగా ఎస్సైగా ప్రమోషన్ పొందినట్లు సమాచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >