Posted on 2025-07-10 16:58:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం లో జరిగిన సమావేశం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
భద్రాచలం దేవస్థానం ఈవోపై ఆంద్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తమపట్నం గ్రామస్థులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అనీ దీనిని విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు, ఒక భక్తుడు భద్రాద్రి రామయ్య కు సమర్పించిన 900 ఎకరాల భూమిని పురుత్తమపట్నం లోని కొందరు కబ్జా దారులు కబ్జ చేసి అనేక అక్రమ కట్టడాలు నిర్మాణాలు నిర్మించారు, కొన్నాళ్ళు క్రితం దేవస్థానం నిర్మించిన గోశాలని కూడా అడ్డుకున్న సమయంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది, ఆంద్రప్రదేశ్ హైకోర్టు కూడా దేవస్థానం భూములను దేవస్థానానికి వెంటనే అప్పగించాలని ఆదేశించినా అప్పటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు, మళ్ళీ గత రెండు రోజుల క్రితం పురుషోత్తపట్నలోని దేవస్థానం భూములలో కబ్జా దారులు అక్రమ నిర్మాణాలు చెపట్టారని సమాచారం తెలుసుకుని వారి సిబ్బంది తో వెళ్ళగా అక్కడి కబ్జా దారులు దేవస్థానం ఈవో మరియు సిబ్బంది పై దాడి చేయడం దుర్మగమైన, హేయమైన చర్య అని దీనిని విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తందని అన్నారు, ఈఓ పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని అన్నారు, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు కల్పించుకుని దేవస్థానం భూములు దేవస్థానానికి అప్పజెప్పాలనీ లేదంటే విశ్వహిందూ పరిషత్ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు,
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు , కొత్తగూడెం నగర కార్యదర్శి అగుళ్ళ యాకయ్య, కొత్తగూడెం నగర సహ కార్యదర్శి నాగుల రవి కుమార్ పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >