Posted on 2025-07-10 13:28:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం లో జరిగిన సమావేశం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
భద్రాచలం దేవస్థానం ఈవోపై ఆంద్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తమపట్నం గ్రామస్థులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అనీ దీనిని విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు, ఒక భక్తుడు భద్రాద్రి రామయ్య కు సమర్పించిన 900 ఎకరాల భూమిని పురుత్తమపట్నం లోని కొందరు కబ్జా దారులు కబ్జ చేసి అనేక అక్రమ కట్టడాలు నిర్మాణాలు నిర్మించారు, కొన్నాళ్ళు క్రితం దేవస్థానం నిర్మించిన గోశాలని కూడా అడ్డుకున్న సమయంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది, ఆంద్రప్రదేశ్ హైకోర్టు కూడా దేవస్థానం భూములను దేవస్థానానికి వెంటనే అప్పగించాలని ఆదేశించినా అప్పటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు, మళ్ళీ గత రెండు రోజుల క్రితం పురుషోత్తపట్నలోని దేవస్థానం భూములలో కబ్జా దారులు అక్రమ నిర్మాణాలు చెపట్టారని సమాచారం తెలుసుకుని వారి సిబ్బంది తో వెళ్ళగా అక్కడి కబ్జా దారులు దేవస్థానం ఈవో మరియు సిబ్బంది పై దాడి చేయడం దుర్మగమైన, హేయమైన చర్య అని దీనిని విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తందని అన్నారు, ఈఓ పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని అన్నారు, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు కల్పించుకుని దేవస్థానం భూములు దేవస్థానానికి అప్పజెప్పాలనీ లేదంటే విశ్వహిందూ పరిషత్ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు,
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు , కొత్తగూడెం నగర కార్యదర్శి అగుళ్ళ యాకయ్య, కొత్తగూడెం నగర సహ కార్యదర్శి నాగుల రవి కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >