Posted on 2025-07-10 17:01:42
డైలీ భారత్, ఖమ్మం: అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు తన సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం పంపిణీ చేశారు. బుర్హాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 13 మంది బాధితులకు వీటిని అందజేశారు. అనంతరం ఆయన చెక్కులు పొందిన లబ్ధిదారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, పగడాల నరేందర్, నేలకొండపల్లి మండలం రాజారాంపేట సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >