Posted on 2025-07-08 21:08:48
హామీ ఇచ్చిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంప్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం నాడు డియుడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆధార్ ఈడీఎం సైదేశ్ కు ఆదేశాలు ఇచ్చారు అదనపు కలెక్టర్. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఈ మెగా క్యాంపు అనంతరం త్వరలోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసి తేదీలు తెలియజేస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఈ మెగా ఆధార్ సవరణల కేంద్రంలో ఇబ్బంది పడకుండా జర్నలిస్టులందరి కోసం ఏర్పాటు చేసే తేదీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతిష్టాత్మక దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఆధార్ సవరణల మెగా క్యాంప్ జూలై 9 10 వ తేదీలలో జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఉదయ్ కుమార్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >