Posted on 2025-07-06 22:31:20
రెండో టెస్ట్లో యువభారత్ ఘనవిజయం
336 పరుగుల భారీ తేడా
ఎడ్జ్బాస్టన్లో భారత్కిదే తొలి గెలుపు
డైలీ భారత్, క్రికెట్ న్యూస్: భారత్ ఎడ్జ్బాస్టన్ లో ఇప్పటివరకు 8 మ్యాచులాడగా, ఏడింటిలో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. ఇది తొమ్మిదో మ్యాచ్. ఎట్టకేలకు 58 ఏళ్ల తర్వాత ఈ వేదికపై తొలివిజయాన్ని నమోదు చేసి భారత్ యువరక్తం చరిత్ర సృష్టించింది. ఆకాశ్దీప్ 10 వికెట్ల ప్రదర్శన చేసి, ఇంగ్లండ్లో ఈ అరుదైన ఫీట్ చేసిన రెండో బౌలర్గా చరిత్ర లిఖించాడు. అంతకుముందు చేతన్శర్మ 1986లో బర్మింగ్హమ్లో పది వికెట్లు తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు అది ఎంత తెలివితక్కువ నిర్ణయమో తెలిసొచ్చింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ యువ సారథి శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీలో చెలరేగగా, జడేజా, యశస్వి సహకారంతో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాదీ సిరాజ్ 6 వికెట్లతో రెచ్చిపోయాడు. ప్రతిగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేసి భారత్కు 180 పరుగుల ఆధిక్యతను అందించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 6 వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆఖరి రోజైన నేడు ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌట్ అయి, 336 పరుగల భారీ తేడాతో అపజయం పాలైంది. భారత బౌలర్ ఆకాశ్దీప్ ఈసారి 6 వికెట్ల బాధ్యత తను తీసుకున్నాడు.
#cricket
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >