Posted on 2025-07-07 08:25:44
ITDA పీవో మాట ఇచ్చారు.. మరిచారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన విద్యార్ధులు...
సుమారు 70 మంది విద్యార్థులకు స్కూలు ఏర్పాటు చేయలేని దుస్థితి లో మన జిల్లా యంత్రాంగం..
గిరిజన మినిస్టర్ మాకు స్కూలు కట్టించండి అంటూ వెండుకోలు..
శ్రీరామ్ పురం ఎస్ టి కాలనీ కి రోడ్డు లేక గిరిజన విద్యార్థుల అవస్థలు...
గిరిజన సంఘాలు నాయకులకు పట్టింపులేదా..? అంటున్న గిరిజన విద్యార్థులు ...?
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలో గల శ్రీరాంపురం ఎస్టి కాలనీ విద్యార్థుల ఆవేదన మాకు స్కూలు కట్టించండి సార్ అంటున్న గిరిజన విద్యార్థులు.
అయ్యా సీఎం సార్ మా గిరిజన గ్రామాలను పట్టించుకోండి మా పిల్లల భవిష్యత్తును మార్చండి అంటూ వేడుకుంటున్న శ్రీరాంపురం ఎస్టి కాలనీ గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు.
శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి రోడ్డు లేక గిరిజన బిడ్డలు విద్యార్థుల అవస్థలు మాకు రోడ్డు వేయండి స్కూలు కట్టించండి అంటూ గిరిజన బిడ్డలు విద్యార్థులు అధికారులను నాయకులను గిరిజన సంఘాలను వేడుకుంటున్నారు.
మా గిరిజన సంఘాలు నాయకులు ఎక్కడ అంటూ గిరిజన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు మా ఊరు సమస్య తీర్చమని ఎన్నో ఏళ్ల తరబడి అధికారులను నాయకులను వేడుకుంటున్నా గాని ఏ ఒక్కరూ మా ఊరుని గాని మా సమస్యలు తీర్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన బిడ్డలు.
వర్షాకాలం వచ్చింది అంటే చాలు అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్స్ కి వెళ్లాలన్న సరైన రోడ్డు లేక నానా అవస్థలు పడుతున్నాము అలాగే మా పిల్లల కు స్కూల్ లేక మా పిల్లలు నిరక్షరాశులుగా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మాలో కొంతమంది ధైర్యం చేసి దూరం స్కూలుకు పంపిస్తే సరైన రోడ్డు మార్గం లేక ఆ బురదలో సుమారు రెండు కిలోమీటర్లు కింద పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ స్కూలుకు ఒక రోజు వెళితే రెండు రోజులు ఇంటికాడ ఉంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న శ్రీరాంపురం ఎస్ టి కాలనీ గిరిజనలు.
దయచేసి పెద్ద నాయకులు అధికారులు మా గ్రామానికి అన్ని వసతులు కల్పించగలరని వేడుకొంటున్న గిరిజన బిడ్డలు...
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >