Posted on 2025-06-30 18:18:47
డైలీ భారత్, హైదరాబాద్: ప్రజాస్వామ్యం లేని పార్టీలో తాను ఉండలేనని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసేశారు టి.రాజాసింగ్ లోధ్! హైదరాబాద్ లో గోషామహల్ ఎమ్మెల్యే ఆయన! ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది! తిరిగి చేర్చుకుంది! ఆయన అదే పార్టీలో వున్నారో లేరో కానీ, మొత్తానికి ఇవాళ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి కార్యకర్తలతో వచ్చారు! పార్టీ నేతలు అడ్డుకున్నారు!
ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ఆయన రాజీనామా లేఖ రాసి ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఇచ్చారు! కార్యకర్తలు కదా అధ్యక్షులను ఎన్నుకునేది, అధిష్టానం ఎంపిక చేయడం ఏమిటి అంటూ ఆయన నిరసన తెలిపారు! ఆయనంతే! ఏదైనా సూటిగా ప్రశ్నించడమే ఆయనకు తెలుసు! నిజాయితీగా మాట్లాడటమే వచ్చు! చేతనైతే సాయం చేయడం లేదంటే, ఇది కుదరదు భాయ్ అని చెప్పేయడమే తెలుసు! ఏదైనా ఖుల్లం ఖుల్లా! ఆయనకు కార్యకర్త అయినా ఒక్కటే, మోదీ అయినా ఒక్కటే! సమ న్యాయం అంటారు! దటీజ్ రాజా సింగ్!
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >