| Daily భారత్
Logo




గుండెపుడి రెవెన్యూ 117లో అక్రమాలపై విచారణ జరపాలి

News

Posted on 2025-06-27 16:49:35

Share: Share


గుండెపుడి రెవెన్యూ 117లో అక్రమాలపై విచారణ జరపాలి

తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసిన బచ్చల లక్ష్మయ్య  

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ 117 సర్వే నెంబర్ ( సీలింగ్ ల్యాండ్ ) ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా భూ పట్టాలు పొందడం, నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున జరుగుతున్న తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ శ్రీనివాస్ కు ఆదివాసీ సంఘం నేత, గ్రామీణ పేదల సంఘం ముఖ్య నాయకులు బచ్చల లక్ష్మయ్య శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో  మాట్లాడుతూ గుండెపుడి రెవెన్యూ ప్రభుత్వ భూమిలో ( సిలింగ్ ల్యాండ్ ) కొందరు గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మార్వోల ప్రమేయంతో ఏజెన్సీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా భూ పట్టాలు పొందారని ఆరోపించారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలు అమలులో ఉండగా, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా పట్టా చేయడం పట్ల ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ భూమిని పట్టా చేయటం, నిబంధనలకు విరుద్ధంగా భూ హక్కు పత్రం పొందిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక  అక్రమంగా ప్రభుత్వ భూమికి హక్కుపత్రం పొంది, అదే ప్రాంతంలో మైనింగ్ శాఖ నుంచి భూ తవ్వకాలకు అనుమతులు పొందడం కూడా ఏజెన్సీ ప్రాంతంలో చట్ట విరుద్ధమేనని ఆయన వ్యక్తం చేశారు. పెద్దపెద్ద యంత్రాలతో తరాలనాటి ఎత్తైన గుట్టలను తవ్వుతున్నారని, పెద్ద ఎత్తున క్వారీలు పెట్టి మట్టిని తరలిస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. గుట్టలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏళ్లనాటి వృక్ష సంపదను కూడా కొల్లగొడుతూ, పర్యావరణ విధ్వంసానికి కొందరు వ్యక్తులు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి కూడా వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. స్పందించిన ఉన్నతాధికారులు సర్వే నంబర్ 117  ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమాలు, పర్యావరణ విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేసి, సమగ్ర విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ మేరకు జూలూరుపాడు తహసిల్దార్ కు కూడా వినతిపత్రం అందజేసి, గుండెపుడి రెవిన్యూ సీలింగ్ ల్యాండ్ లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేసి, ప్రభుత్వ భూమితో పాటు పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Image 1

పూరీ జగన్నాథ రథయాత్ర

Posted On 2026-07-16 05:34:18

Readmore >
Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >