Posted on 2023-12-14 12:53:21
రిమ్స్ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన
డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధ వారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది.
క్యాంపస్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపి స్తున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తున్నది.
ఈ క్రమంలో ఇంటర్న్షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా, క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్తోపాటు క్యాంప స్లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
కాలేజీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ క్రాంతి దిష్టిబొమ్మను దహనం చేశారు.
వసీం అనే వ్యక్తితో కలిసి మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని చెప్పారు. అయితే మెయిన్ గేట్ సెక్యూరిటీని లెక్క చేయ కుండా దుండగులు క్యాం పస్లోకి వచ్చారని, వారంతా రిమ్స్ డైరెక్టర్ అభిమానులని ఆరోపి స్తున్నారు.
అయితే ఎలాంటి అవాం ఛనీయ పరిస్థితులు తలెత్త కుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రిమ్స్లోకి చొరబడ్డ వ్యక్తు లను పోలీసులు అదు పులోకి తీసుకొని విచారి స్తున్నట్లు సమాచారం...
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >