Posted on 2025-06-19 08:53:54
డైలీ భారత్, జనగామ జిల్లా: బుధవారం ఉదయం దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ధరావత్ తండా నుండి ధర్మగడ్డ తండాకు ఉదయం 9:30 సమయంలో ఎస్సై సృజన్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ధర్మగడ్డ తండా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని చూసి ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించి,వారి చేతిలో ఉన్న కవర్ లో ఏముంది అని అడుగగా వారు తడబడుతూ, భయపడుతూ వారి వద్ద గంజాయి ఉన్నదని తెలుపగా వెంటనే ఎస్పై వారిని అదుపులోకి తీసుకొని వారి యొక్క వివరాలు అడుగగా భూక్యా నరేశ్,చౌడబోయిన సురేష్ వీరు ధర్మగడ్డ తండాకు చెందిన వారని చెప్పగా వారిని విచారించగా భూక్యా నరేశ్ హైదరాబాద్ లో పని చేసేటప్పుడు అతని స్నేహితుల ద్వారా సిగిరెట్ తాగడం అలవాటు అయిందనీ వారితో పాటు దుల్ పేటకు వెళ్ళి గంజాయ్ తాగడం కూడా అలవాటు అయిందనీ స్వంత ఊరికి వచ్చిన్నపుడు స్నేహితుడు అయిన చౌడబోయిన సురేష్ కు కూడా గంజాయ్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి గంజాయి తాగుతుండే వాళ్ళమని చెప్పారని,వారి వద్ద నుండి రెండు చిన్న పాకెట్ల గంజాయిని రూ.2 వేల విలువ గల వాటిని స్వాదినం చేసుకొని వారి వద్ద వున్న రెండు ప్లాస్టిక్ కవర్ తెరచి చూడగా అందులో రెండు ప్లాస్టిక్ జిప్ కవర్లు ఉన్నాయని,వాటిని తెరచి చూడగా ఎండిన మొగ్గల మిశ్రమంగా కలిగి ఘాటైన వాసన వస్తుండగా ఈ పదార్థం ఏమిటని అడుగగా వారు ఎండు గంజాయని తెలిపారు.గంజాయిని తూకము వేయగా, అది 20 గ్రాములు ఉందని, సురేష్ వద్ద గల వీవో కంపెనీకి చెందిన నలుపు రంగు మొబైల్ ఫోన్ దాని నెంబర్ 7569132692 ఐఎంఈఐ నెంబర్ 867663044190293 867663044190285 తీసుకొని రావడం జరిగినదనీ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినదని, నెరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ ను వారి సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్,ఏసీబీ అంబటి నరసయ్య సీఐ జానకిరామ్ రెడ్డి అను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల ఎస్సై రాజు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >