Posted on 2025-06-08 08:09:59
డైలీ భారత్, జయశంకర్ భూపాలపల్లి: పెళ్లికోసం వెళ్లిన యువకులు సరదాకు గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 6 గురు యువకులు గల్లంతవడం తో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరైన బంధువుల్లో ఎనిమిది మంది శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అంబట్పల్లి నుంచి ఆటోలో మేడిగడ్డకు వెళ్లారు.
గోదావరిలో స్నానం చేయడానికి అని వెళ్లిన వారిలో మొదట పట్టి మధుసూదన్ అనే యువకుడు నదిలోకి దిగాడు. అయితే అక్కడే ఉన్న గుంతను గమనించకుండా దిగడంతో మునిగిపోయాడు. మధుసూదన్ మునిగి పోవడాన్ని గమనించిన అతని సోదరుడు పట్టి శివమనోజ్ ఆయనను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా గుంతలో మునిగిపోయాడు. అలా ఒకరిని కాపాడపోయి ఒకరుగా మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. కాగా మధుసూదన్, మనోజ్ల తండ్రి పట్టి వెంకటస్వామి ఆటలోనే వారంతా అక్కడికి వెళ్లారు. ఆయన ఆటోను నది ఒడ్డున పెట్టి వచ్చేలోపే ఇద్దరూ కుమారులు కళ్లముందే నదిలో గల్లంతవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు.గల్లంతయిన వారిలో నలుగురు అంబట్ పల్లికి చెందినవారు కాగా మరో ఇద్దరు కొర్లకుంట గ్రామానికి చెందిన వారున్నారు. గల్లంతయిన వారిలో రక్షిత్, సాగర్, మధుసూదన్, రాంచరణ్, శివమనోజ్, రాహుల్ ఉన్నారు. అందరూ కూడా 20 ఏండ్ల లోపు వారే కావడం విషాదకరం.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >