| Daily భారత్
Logo




మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు ఎన్‌కౌంటర్?

News

Posted on 2025-06-06 10:32:52

Share: Share


మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు ఎన్‌కౌంటర్?

డైలీ భారత్, లక్నో: లక్నోలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు పోలీసులు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడని చెబుతున్నారు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగింది, ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది.  అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాని ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

ఈ ఘటన జూన్ 5న జరిగింది, దీనిపై ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత, చివరికి పోలీసులకు బ్రేక్‌త్రూ సాధించారు.  

లక్నో DSP ఆశిష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ ఘటన జూన్ 5న ఉదయం 10 గంటలకు జరిగిందని, దీనిపై ఆలంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే, పోలీసు బృందం పూర్తిగా అప్రమత్తమైంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.


DSP ప్రకారం, నిందితుడు దీపక్ వర్మగా గుర్తించారు.  అతని స్కూటీ నంబర్ ప్లేట్ ద్వారా పోలీసులకు ఈ సమాచారం అందింది. పోలీసు ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన నిందితుడికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ వైద్యులు అతన్ని మరణించినట్లు ప్రకటించారు. 

మరోవైపు బాధితురాలి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. లక్నోలోని KGMU ట్రామా సెంటర్‌లో ఈరోజు బాలికకు శస్త్రచికిత్స చేయనున్నారు. నిందితుడు దీపక్ వర్మ నుంచి ఘటనలో ఉపయోగించిన స్కూటీ, ఒక  తుపాకీ,  పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కూడా నిందితుడు దీపక్ వర్మపై కేసు నమోదు అయిఉంది. ఆ కేసు విచారణ కొనసాగుతోంది.  

పోలీసులు , నిందితుడి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో, SHO ఆలంబాగ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ , కారుపై బుల్లెట్లు తగిలాయి. నిందితుడి కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు, 24 గంటల్లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. పారిపోతున్న నిందితుడిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు దీపక్ వర్మకు బుల్లెట్ తగిలింది, అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారరు. అక్కడ చికిత్స పొందుతూ  మరణించినట్లు వైద్యులు ప్రకటించారు

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >