| Daily భారత్
Logo




మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు ఎన్‌కౌంటర్?

News

Posted on 2025-06-06 07:02:52

Share: Share


మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు ఎన్‌కౌంటర్?

డైలీ భారత్, లక్నో: లక్నోలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు పోలీసులు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడని చెబుతున్నారు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగింది, ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది.  అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాని ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

ఈ ఘటన జూన్ 5న జరిగింది, దీనిపై ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత, చివరికి పోలీసులకు బ్రేక్‌త్రూ సాధించారు.  

లక్నో DSP ఆశిష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ ఘటన జూన్ 5న ఉదయం 10 గంటలకు జరిగిందని, దీనిపై ఆలంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే, పోలీసు బృందం పూర్తిగా అప్రమత్తమైంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.


DSP ప్రకారం, నిందితుడు దీపక్ వర్మగా గుర్తించారు.  అతని స్కూటీ నంబర్ ప్లేట్ ద్వారా పోలీసులకు ఈ సమాచారం అందింది. పోలీసు ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన నిందితుడికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ వైద్యులు అతన్ని మరణించినట్లు ప్రకటించారు. 

మరోవైపు బాధితురాలి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. లక్నోలోని KGMU ట్రామా సెంటర్‌లో ఈరోజు బాలికకు శస్త్రచికిత్స చేయనున్నారు. నిందితుడు దీపక్ వర్మ నుంచి ఘటనలో ఉపయోగించిన స్కూటీ, ఒక  తుపాకీ,  పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కూడా నిందితుడు దీపక్ వర్మపై కేసు నమోదు అయిఉంది. ఆ కేసు విచారణ కొనసాగుతోంది.  

పోలీసులు , నిందితుడి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో, SHO ఆలంబాగ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ , కారుపై బుల్లెట్లు తగిలాయి. నిందితుడి కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు, 24 గంటల్లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. పారిపోతున్న నిందితుడిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు దీపక్ వర్మకు బుల్లెట్ తగిలింది, అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారరు. అక్కడ చికిత్స పొందుతూ  మరణించినట్లు వైద్యులు ప్రకటించారు

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >