Posted on 2025-05-27 10:06:15
డైలీ భారత్, హైదరాబాద్: ఖమ్మం జిల్లావైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బానోత్ మదన్ లాల్ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేరి ఈ ఉదయం మరణించినట్లు తెలిసి ఎంపీ రవిచంద్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు,నమ్మలేకపోయారు.మదన్ లాల్ తనకు సన్నిహితుడని, బీఆర్ఎస్ నాయకుడిగా, ఎమ్మెల్యే గా వైరా నియోజకవర్గానికి,ప్రజలకు విశేష సేవలందించారని, అకాల మృత్యువుకు లోనవ్వడం తీవ్ర బాధాకరమని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.ఆయన మృతితో బీఆర్ఎస్, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు,వైరా నియోజకవర్గ ప్రజలు నిబద్ధత కలిగిన నాయకుడని కోల్పోయారని,తీరని లోటని ఎంపీ రవిచంద్ర అన్నారు. ఆయన మృతి మదన్ లాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >