Posted on 2025-05-18 04:18:57
డైలీ భారత్, మహబూబాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారీ తో కలిసి మే - 2025 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే - 2025 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన (14) పరీక్ష కేంద్రాల్లో (2539) మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, (1594) రెండవ సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం (4133) మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు.
ఈ మేరకు (14) మంది చీఫ్ సూపరింటెండెంట్లు, (14) మంది డిపార్ట్మెంటల్ అధికారులు, (01) అదనపు చీఫ్ సూపరింటెండెంటు, (01) కస్టోడియన్,(1) ఫ్లయింగ్ స్క్వాడ్, (1) ను నియమించామన్నారు.
నిర్దేశించిన మార్గాల ద్వారా ప్రశ్నపత్రాలను ఆయా పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత నడుమ చేరవేయాలన్నారు.
ఆయా పరీక్షా కేంద్రాల్లో నిఘా నేత్రాలను (సీసీ కెమెరాలు) సరిచూసుకోవాలన్నారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది సరిపడా ఔషధ నిల్వలతో కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
ఈ సమన్వయ సమావేశంలో డీ.ఐ.ఈ.ఓ మాధార్, ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ నరేష్, డి.ఎం.హెచ్. ఓ రవి రాథోడ్, మహబూబాబాద్ టౌన్ సి.ఐ పి.సర్వయ్య, జి.సి.జి.డి.ఓ శ్రీరాములు, తొర్రూరు మునిసిపల్ కమిషనర్ శాంతి కుమార్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, పోస్టల్ అధికారి గోపీకృష్ణ, ఆర్టీసీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >