Posted on 2025-05-18 04:20:35
కొత్తగూడెం కలెక్టరేట్ లోని మహిళా శక్తి క్యాంటీన్ సందర్శనలో డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీ రఘురాం రెడ్డి
డైలీ భారత్, కొత్తగూడెం:"ఎలా ఉన్నారమ్మా.. వ్యాపారం బాగా జరుగుతోoదా..?" అంటూ..కొత్తగూడెం కలెక్టరేట్ లోని ఇందిరా మహిళా శక్తి కాంటీన్ నిర్వాకులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఆత్మీయంగా పలకరించి వివరాలు తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన సందర్భంగా.. కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం, ఎంపీ రఘురాం రెడ్డి...కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లతో కలిసి లిఫ్ట్ సమీపంలో గల కాంటీన్ ను సందర్శించి.. లాభసాటిగా నిర్వహిస్తున్నారా..? అంటూ అడిగారు. "బాగుంది సార్.. క్యాంటీన్ బాగానే నడుస్తోంది.."అంటూ నిర్వాకులైన మహిళలు బదులివ్వగా.. సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీ రఘురాం రెడ్డి అక్కడ కాఫీ సేవించి.. అధికారులతో సమావేశానికి వెళ్లారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >