Posted on 2025-05-07 15:55:22
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుదవారం చేవెళ్ల అట్లాస్ ఫంక్షన్ హాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్ & స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, తారా సింగ్ , రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్,కో–ఆర్డినేటర్ గుత్త అమిత్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ ముదిరాజ్,నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >