| Daily భారత్
Logo




పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-05-03 13:42:29

Share: Share


పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల, షాబాద్, శంకర్ పల్లి, మొయినాబాద్ మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పంపిణీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు వరమన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన మన సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,సున్నపు వసంతం ,ప్రతాప్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మహేందర్ గౌడ్,శ్రీనివాస్, జంగయ్య,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >