Posted on 2025-05-03 09:18:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనీ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షానికి మండలాలలో పలు గ్రామంలో వరి ధాన్యం, మక్కలు, మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 20వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో దాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల దగ్గర ఉన్న ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారని,. రైతులను పట్టించుకునే నాధుడే లేడని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. గాలి వానతో ఇండ్ల పైకప్పులు లేచిపోయి నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి మండల కేంద్రంలో ఆందోళన చేపడతామని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >