Posted on 2025-04-27 22:11:43
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించాలని, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని షాద్ నగర్ నియోకవర్గం బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వర్ రావు.ఆదివారం షాద్ నగర్ నియోకవర్గం బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. కాశ్మీర్లో పర్యాటకుల మీద కక్షపూరితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమైన విషయమన్నారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యలను దేశ పౌరులు ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. అమాయకుల మీద చేసిన దాడి చాలా బాధాకరమని భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాడుల పట్ల స్పందించవలసిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద దాడి హేయం అన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.ఈ దాడి ప్రతి పౌరుడినీ కన్నీరు పెట్టించిందన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు .
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >