Posted on 2025-04-27 20:08:51
- తగలబెట్టిన ద్విచక్ర వాహనం
- కారు అద్దాలు ధ్వంసం
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు చల్ల ఉమారవి
డైలీ భారత్, మరిపెడ: ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా...తమ్ముడు భార్యపై అన్న పెట్రోల్ తో దాడి చేయగా త్రుటిలో తప్పించుకొని పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది...అలాగే ఇంటిముందు పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు.. ఈ సంఘటన మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలో చోటుచేసుకుంది.. బాధితులు చల్ల ఉమారవి తెలిపిన వివరాల ప్రకారం ఐదు ఎకరాల భూమి విషయంలో గత పది సంవత్సరాల నుండి మా అన్న అయినా చల్ల సత్యనారాయణ భూ విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని,భూమిపై వస్తే బెదిరింపులకు గురి చేస్తూ వస్తున్నారన్నారు..మా తల్లిదండ్రులు చల్లా మల్సూర్ ఉపేంద్ర కు ముగ్గురు సంతానమని పెద్దవాడైన సత్యనారాయణ భూమి విషయంలో కన్న తల్లిదండ్రులకు,తోడబుట్టిన అన్నదమ్ములకు ఇబ్బందులకు గురి చేస్తూ ఒక్కరే భూమిని ఆక్రమించుకొని తింటున్నారన్నారు.. ఈ విషయమై రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీసులు ముగ్గురు సమభాగం తీసుకోవాలని తీర్పు చెప్పారన్నారు.. అందులో భాగంగానే 5 ఎకరాల మామిడి తోటలో నా భాగంలో నేను మామిడికాయలు కోస్తూ ఉండగా, పెట్రోల్ బాటిల్ తో వచ్చే నా భార్య పై దాడి చేయగా త్రుటిలో తప్పించుకుందని,పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయిందని,అలాగే కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లతో కొట్టి అనరాని మాటలు తిడుతూ చంపేస్తానని బెదిరించారన్నారు.. రాజకీయ పలుకుబడితో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో అన్న అయినా సత్యనారాయణ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, వీరారం గ్రామంలో బతకడానికి ఇబ్బందిగా ఉందని పోలీస్ వారు నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు...అన్న చల్ల సత్యనారాయణ తో మాకు ప్రాణహాని ఉందని తెలిపారు...
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >