Posted on 2025-04-27 16:35:21
డైలీ భారత్, పటాన్చెరు: భారతదేశంలో ఉంటూ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతున్న వారిని దేశ ద్రోహులుగా ప్రకటించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు
పటాన్చెరు పట్టణo లో టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ మొన్నా పా హాల్గాం జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ ప్రాణాలు కోలిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి సానుభూతి తెలియజేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన అంటే ఉగ్రవాదులు హిందువుల ముస్లింల అని ప్యాంటులను విప్పదీసి చూసి మరీ కాల్చిన ఆ మతోన్మాద ఉగ్రవాదులను పట్టుకొని బహిరంగంగా కాల్చి చంపాలి అని డిమాండ్ చేయడం జరిగింది, మతోన్మాదులు కొంతమంది భారత దేశంలో ఉంటూ, దేశం తిండి తింటూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న వారిని ఎవ్వరైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే వెంటనే దేశద్రోహులు కింద ప్రకటించి వారిని శిక్షించాలని కోరారు అదేవిధంగా దేశానికి ఎలాంటి ప్రమాదం వచ్చిన దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఏకమై కులాలకు మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి, ఉగ్రవాదం నశింప చేసే వరకు 140 కోట్ల మంది ఏకమై దేశభక్తితో భారత ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతుగా ఉండాలని బైండ్ల కుమార్ కోరారు,
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు న్యాయవాది ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు పాల్గొనడం జరిగింది.
నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"
Posted On 2026-08-27 07:58:21
Readmore >
గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
Posted On 2026-08-27 05:16:28
Readmore >
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >