Posted on 2025-04-27 20:05:21
డైలీ భారత్, పటాన్చెరు: భారతదేశంలో ఉంటూ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతున్న వారిని దేశ ద్రోహులుగా ప్రకటించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు
పటాన్చెరు పట్టణo లో టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ మొన్నా పా హాల్గాం జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ ప్రాణాలు కోలిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి సానుభూతి తెలియజేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన అంటే ఉగ్రవాదులు హిందువుల ముస్లింల అని ప్యాంటులను విప్పదీసి చూసి మరీ కాల్చిన ఆ మతోన్మాద ఉగ్రవాదులను పట్టుకొని బహిరంగంగా కాల్చి చంపాలి అని డిమాండ్ చేయడం జరిగింది, మతోన్మాదులు కొంతమంది భారత దేశంలో ఉంటూ, దేశం తిండి తింటూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న వారిని ఎవ్వరైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే వెంటనే దేశద్రోహులు కింద ప్రకటించి వారిని శిక్షించాలని కోరారు అదేవిధంగా దేశానికి ఎలాంటి ప్రమాదం వచ్చిన దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఏకమై కులాలకు మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి, ఉగ్రవాదం నశింప చేసే వరకు 140 కోట్ల మంది ఏకమై దేశభక్తితో భారత ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతుగా ఉండాలని బైండ్ల కుమార్ కోరారు,
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు న్యాయవాది ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు పాల్గొనడం జరిగింది.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >