Posted on 2025-04-08 12:06:09
ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారుచేసిన హైకోర్టు
NIA కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు
2016 డిసెంబర్లో ఉరిశిక్ష ఖరారు చేసిన NIA కోర్టు
దోషులు అసదుల్లా అక్తర్, రెహ్మాన్కు ఉరిశిక్ష
దోషులు తహసీన్ అక్తర్, భక్తల్, అజాజ్కు ఉరిశిక్ష
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. నిందితుల అప్పీల్ను కొట్టివేస్తూ తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇది ఉగ్రవాదంపై న్యాయపోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని హైకోర్టు పేర్కొంది. కాగా, 2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్లకు 2016 డిసెంబరు 13న తీర్పు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా.. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఐదుగురు నిందితులకు విధించిన ఉరిశిక్షను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సమర్థించింది
ఈ పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. యాసిన్ భత్కల్ సహా పలువురు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2016లో NIA ఫాస్ట్ట్రాక్ కోర్టు ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు NIA కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సమర్థిస్తూ.. నిందితుల అప్పీల్ పిటిషన్ను తాజాగా కొట్టివేసింది. ఈ తీర్పు దేశంలో ఉగ్రవాద దాడులపై న్యాయపోరాటంలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోందని హైకోర్టు అభిప్రాయ పడింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >