Posted on 2025-04-05 11:01:14
డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు,ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది, 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి, 2021 జనవరి నుంచి సి ఎస్ గా వ్యవహరిస్తున్నారు.
ఆమె పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది ఈ నేపథ్యంలోనే తదుపరి సి ఎస్ గా కె, రామకృష్ణారావు, పేరును ఖరారు చేసినట్లు సమాచారం.1990 బ్యాచ్ ఐఏఎస్కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు.
రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్ల్లో శశాంక్గోయల్తరువాత సీనియర్గా రామకృష్ణారావు ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయన కున్న అనుభవం తొడ్పడు తుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయనను సీఎస్గా నియమించాలనే ఆలోచన చేసినట్లుగా సమాచారం.
రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుత సీఎస్శాంతి కుమారి, తన సర్వీసుకు వీఆర్ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఆమె వీఆర్ఎస్నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లుగా సమాచారం.
దీంతో కొత్త సీఎస్గా కె,రామకృష్ణారావును నియమించేందుకు ప్రభు త్వం నిర్ణయించి నట్లుగా సమాచారం. వాస్తవంగా శాంతి కుమారి ఈనెలఖరున పదవీ విరమణ చేయనున్నారు. అంత కంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్తీసుకో వాలని ఆలోచన చేస్తున్న ట్లుగా తెలిసింది.
వీఆర్ఎస్ తరువాత శాంతి కుమారి ని చీఫ్ఇన్ఫర్మేషన్కమిషనర్గా నియమించ నున్నట్లుగా సమాచారం. ఆమె నియామకం ఇప్పటికే ఖరారు అయిందని, కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని తెలి సింది. వచ్చే వారం సమాచార కమిషనర్లకు సంబంధించిన నియామక సమావేశం జరగనున్నట్లు గా తెలిసింది.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష తన జరిగే సమావేశంలో ఆమెతో పాటు మరికొందరు సమాచార కమిషనర్లుగా నియమించనున్నట్లుగా తెలిసింది.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >