| Daily భారత్
Logo




ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వాడబలిజ సంఘ అధ్యక్షుడు డర్ర దామోదర్

News

Posted on 2025-03-21 22:37:21

Share: Share


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వాడబలిజ సంఘ అధ్యక్షుడు డర్ర దామోదర్

తెలంగాణ శాసనసభలో బీసీలకు  42% రిజర్వేషన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వాడబలిజ సంఘ అధ్యక్షుడు డర్ర దామోదర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండల కేంద్రం లో మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి తీసుకొని శాసనసభలో ఏకగ్రీవంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ఎంత సంతోషకరంగా ఉందని తెలియజేశారు.  42% రిజర్వేషన్ కొరకు శాసనసభలో సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,బిజెపి పార్టీ నాయకులకు, సిపిఎం,సిపిఐ నాయకులకు, శాసనసభలో సహకరించిన శాసనసభ్యులందరికీ  శాసన మండలి సభ్యులకు ప్రత్యేకించి బీసీల హక్కుల కొరకు అనునిత్యం పోరాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం. అయితే దురదృష్టం  ఏంటి అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి కానికరించట్లేదన్న విధంగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న  బీసీ కులస్తులు లకు ఎటువంటి హక్కులు లేకపోవడం బాధాకరం గా ఉందని అందులో ప్రత్యేకంగా  ఈ గోదావరి పరివాహక   ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాడబలిజ కులస్తులు ఈ గోదావరి మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి తెలంగాణ మీదుగా 1465 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ భారతదేశంలోనే పొడవైన నదుల్లో రెండవ నదిగా గోదావరి ప్రవహిస్తూ  ఆంధ్రప్రదేశ్ నరసాపురం దగ్గర సముద్రంలో కలిసేంతవరకు గోదావరికి ఇరువైపులా మూడు రాష్ట్రాల్లో వాడ బలిజ కులస్తులు నివసిస్తున్నప్పటికీ తెలంగాణలోని అత్యధిక జనాభా కలిగిన ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి,ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో లక్షలాది జనాభా వందల సంవత్సరాల ముందు నుండి నివసిస్తున్నటువంటి మా కులస్తులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల వలన తీరని అన్యాయం జరుగుతుందని ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చట్టాల కన్నా ముందు నుండి ఈ ప్రాంతం లో నివసిస్తున్న మాకు ఈ ప్రాంతంలో సర్వహక్కులు కల్పించాలని లేనియెడల ఇక్కడ ఉన్నటువంటి చట్టాలపై 50% హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Image 1

రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్

Posted On 2026-03-11 09:28:55

Readmore >
Image 1

మోడల్ హౌసింగ్ కాలనీ మౌళిక సదుపాయాలకు గాను 20 కోట్లు మంజూరు

Posted On 2026-03-11 08:18:13

Readmore >
Image 1

సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

Posted On 2026-03-10 20:55:00

Readmore >
Image 1

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

Posted On 2026-03-10 20:28:52

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

Posted On 2026-03-10 19:55:08

Readmore >
Image 1

సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు

Posted On 2026-03-10 19:34:32

Readmore >
Image 1

స్కూలుకు "తాళం"... విద్యార్థుల "ఆక్రందన"

Posted On 2026-03-10 19:26:04

Readmore >
Image 1

సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం

Posted On 2026-03-10 18:48:11

Readmore >
Image 1

ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి

Posted On 2026-03-10 18:22:28

Readmore >
Image 1

జిల్లా సంఘం ఆధ్వర్యంలో మున్నూరుకాపు కౌన్సిలర్లకు సన్మానం

Posted On 2026-03-10 18:10:43

Readmore >