Posted on 2025-02-16 21:59:00
వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో నిర్వహించే వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తాలూకా కోఆర్డినేటర్ తమగొండ రాజశేఖర్ పిలుపునిచ్చారు. వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్స్ ను మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, నిరంతరం ప్రజా సంక్షేమానికై ఎవరు ఊహించని స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శీలం శ్రీకాంత్, రాఘవేందర్, సందీప్, సాయి, నవీన్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >