Posted on 2025-02-05 15:09:57
ముఖ్య అతిథిగా ప్రసంగించిన ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన
డైలీ భారత్, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో పుస్తకావిష్కరణ ఘనంగా జరిగినది. కందాళ పద్మావతి రచించిన "హృది స్వప్నం" కవితా సంపుటి ని ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డా. చిటికెన కిరణ్ కుమార్ .ఆచార్య కొలకలూరు ఇనాక్, డా. నాలేశ్వరం శంకరంలు ఆవిష్కరించారు.
సభను ఉద్దేశించి ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ కవితా సంపుటిలోని విషయాలను కూలంకుశంగా చర్చించారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదన్నారు. సామాజిక మాధ్యమాలలో అనేకంగా పలు సంఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రాచాత్య ధోరణిలో మనిషి యాంత్రిక జీవనంలో కొనసాగుతూ అనేక మైనటువంటి బాధ్యతలు విస్మరిస్తున్నారని చిటికెన తెలిపారు.
కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కంచర్ల విజయభాస్కర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్, డా. చిటికెన కిరణ్ కుమార్, డా. నాలేశ్వరం శంకరంలు పాల్గొన్నారు. పుస్తక రచయిత్రి కందాల పద్మావతి, ప్రముఖ గాయని దివాకర్ల సురేఖ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమలాకరశర్మ, వేల్పూరి నరసింహాచార్యులు, తేరాల సాధన, సతీష్ లతో పాటు పలు రాష్ట్రాల నుండి కవులు, రచయితలు హాజరై సభను విజయవంతం చేశారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >