| Daily భారత్
Logo




ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోరా ?

News

Posted on 2025-02-03 18:47:20

Share: Share


ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోరా ?

ప్రభుత్వ స్థలమని తేల్చిన అధికారులు మరి చర్యలు ఎందుకు తీసుకోరు ?

ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంపై అధికారులు చర్యలు తీసుకునేది ఎప్పుడు ?

పలు దినపత్రికల్లో  ప్రచురిస్తున్నప్పటికీ అక్రమ కట్టడాన్ని ఆపలేక పోయిన అధికారులు 

ప్రభుత్వ స్థలంలోనే కట్టడం అని తేల్చినాక ఫుట్ పాత్ ఆక్రమిస్తూ రోడ్డు దాకా నిర్మాణం

ప్రశాంత్ నగర్ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడం కూల్చేదెప్పుడు ?

డైలీ భారత్, చుంచుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కట్టడం మొదలుపెట్టారు. ఆనాడే రెవిన్యూ సిబ్బంది స్పందించి ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణదారులు బోర్డు ను  తీసివేసి భవనాన్ని నిర్మించారు. నిర్మించారు కానీ దాని ప్రారంభోత్సవం చేయలేకపోయారు ఎందుకంటే అది ప్రభుత్వ స్థలంలో కట్టారు కాబట్టి దానికే ఎటువంటి అనుమతులు లేవు. ఆనాటి సెక్రటరీ వారికి ఎటువంటి ఎన్ఓసి కూడా ఇవ్వలేదు. దీనితో నిర్మాణం మూడు సంవత్సరాలుగా ఖాళీగానే ఉండడం జరిగింది. ఏమి జరిగిందో ఏమో కానీ గత ఆరు నెలల క్రితం హోటల్ పెట్టుకోవడం అనుమతులు లేకుండానే పెట్టడం జరిగింది.. దేనితో రెవిన్యూ సిబ్బంది ఎంక్వయిరీ చేసి ఇది ప్రభుత్వ స్థలమే అని తేల్చి కలెక్టర్కు అందజేయడం జరిగింది. మరి ప్రభుత్వ స్థలమే అని తెలిసి దాని నిర్మాణదారులు నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మాణాన్ని మరలా చేపట్టడం జరిగింది. నేషనల్ హైవే రోడ్డు పక్కనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలం అని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు దానిని స్వాధీనపరచుకోలేకపోతున్నారు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ స్థలమే అని కలెక్టర్ కి సమర్పించారు మరి కలెక్టర్ దగ్గర నుంచి ఏమైనా ఆదేశాలు రావాలా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనాపటికి ప్రభుత్వ స్థలంలో నిర్మాణమై తెలిసిన తర్వాత ఉపేక్షించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఆడుకుంటున్నారు. ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా అని ప్రశాంత్ నగర్ గ్రామ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

Image 1

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Posted On 2026-03-12 18:24:55

Readmore >
Image 1

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము

Posted On 2026-03-12 17:34:10

Readmore >
Image 1

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ

Posted On 2026-03-12 17:29:36

Readmore >
Image 1

లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Posted On 2026-03-12 17:28:11

Readmore >
Image 1

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

Posted On 2026-03-12 13:47:01

Readmore >
Image 1

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

Posted On 2026-03-12 13:45:42

Readmore >
Image 1

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష

Posted On 2026-03-12 13:44:39

Readmore >
Image 1

నిషేధిత హుక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం

Posted On 2026-03-12 13:10:02

Readmore >
Image 1

ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ

Posted On 2026-03-12 13:04:32

Readmore >
Image 1

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Posted On 2026-03-12 12:57:08

Readmore >