Posted on 2025-02-03 18:49:12
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ చేజిక్కించుకోవడంలో భద్రాచలం కి చెందిన గొంగడి.త్రిషారెడ్డి కీలక పాత్ర
ఇండియాకు వరల్డ్ కప్ అందించిన గొంగడి త్రిషారెడ్డి కి దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో19 ఏళ్ల గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ ను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటు ఈ టోర్నీలో ఒక సెంచరీ కూడా చేసింది.యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. మహిళా క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ లు భారత క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు ఆ వరుసలో చేరేందుకు సంసిద్ధమవుతోంది ఈ తెలుగుతేజం.అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాంటింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పల్లెటూరి నుంచి మొదలైన క్రీడాకుసుమం దండయాత్ర ప్రపంచ వేదికపై పరుగుల వరద పారిస్తోంది. మహిళల అండర్ -19 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసి సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది.ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు గొంగడి త్రిషనే. బౌలింగ్లోనూ సత్తా చాటి గొంగడి త్రిష 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఓపెనర్గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >