Posted on 2026-03-12 08:34:32
డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అంతిమయాత్రలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మోహన్ రెడ్డి చివరి మజిలీలో షబ్బీర్ అలీ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.
శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం జరిగిన అంతిమయాత్రలో షబ్బీర్ అలీ స్వయంగా పాడే మోసి తన ముఖ్య అనుచరుడి పట్ల ఉన్న ఆత్మీయతను, అనుబంధాన్ని చాటుకున్నారు. అందరితో కలిసి నడుస్తూ చివరి యాత్రలో పాల్గొనడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
మోహన్ రెడ్డి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను” అని తెలిపారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >