Posted on 2026-03-12 13:04:32
డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అంతిమయాత్రలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మోహన్ రెడ్డి చివరి మజిలీలో షబ్బీర్ అలీ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.
శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం జరిగిన అంతిమయాత్రలో షబ్బీర్ అలీ స్వయంగా పాడే మోసి తన ముఖ్య అనుచరుడి పట్ల ఉన్న ఆత్మీయతను, అనుబంధాన్ని చాటుకున్నారు. అందరితో కలిసి నడుస్తూ చివరి యాత్రలో పాల్గొనడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
మోహన్ రెడ్డి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను” అని తెలిపారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >