Posted on 2023-08-30 06:13:38
ఎల్పీజీ సిలిండర్ ధర ₹200 తగ్గిస్తూ ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటగ్యాస్ సిలిండర్ ధరను ₹200 మేర తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దేశంలోని వినియోగదారులందరికీ- అంటే… 33 కోట్ల మంది ఎల్పిజి వాడకందారులకు ప్రయోజనం కలుగుతుంది.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ- రాఖీ పండుగ శుభ సందర్భంలో ఇది మన కుటుంబాల్లో ఆనందం ఇనుమడింపే చేసు రోజుగా ఆయన అభివర్ణించారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వారి ఖాతాల్లో ప్రతి సిలిండరుకు ₹200 వంతున సబ్సిడీ జమ అవుతుంది.
ఈ పథకం కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి "ఎక్స్" పోస్టులపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:
రక్షాబంధన్ పర్వదినం మనందరి కుటుంబంలో ఆనందాన్ని ఇనుమడింపజేసే రోజు. ఈ సందర్భంగా వంటగ్యాస్ ధర తగ్గింపు మన సోదరీమణులకు సౌకర్యం పెంచి, వారి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మేరకు నా ప్రతి సోదరి సంతోషంగా.. ఆరోగ్యంగా.. సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అని పేర్కొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >